📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirupati : తిరుపతి కేంద్రంగా ఆధ్యాత్మిక కారిడార్ – బిజెపి రాష్ట్ర చీఫ్ మాధవ్

Author Icon By Shravan
Updated: August 13, 2025 • 9:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati : తిరుపతి కేంద్రంగా ఆధ్యాత్మిక కారిడార్ – బిజెపి రాష్ట్ర చీఫ్ మాధవ్ కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమలుచేస్తున్న సంక్షేమపథకాల స్పూర్తితో ఎపిలో బిజెపిని సంస్థాగతంగా బలపరచడానికి ఒక రోడ్మ్యాప్ రూపొందిస్తు న్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీకోసం పనిచేస్తున్న కార్యకర్తల శ్రమ వృధాకానివ్వబోనని భరోసా నిచ్చారు. రాష్ట్రరాజధాని అమరావతిని స్మార్ట్ సిటీ పథకం (Smart City Scheme) క్రింద అభివృద్ధి చేయడానికి, అమలుకు కేంద్రప్రభుత్వం అనుమతిమంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికనగరం తిరు పతిని కేంద్రాంగా చేసుకుని ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థా నంలో అన్యమత ఉద్యోగులను ఇతర శాఖలకు బదలీ చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర బిజెపి చీఫ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా మంగళవారం ఉదయం సారధ్యం (Leadership) కార్యక్రమంలో పాల్గొనేందుకు మాధవ్ తిరుపతికి చేరుకున్నారు. ఉదయం ఆయన నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న బాబూ జగజ్జీవన్రామ్ ఉద్యానవనం వద్దకు వచ్చారు. ఆయనకు బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, మాజీ ఎంపి డాక్టర్ వరప్ర సాద్, బిజెపి నాయకులు చంద్రారెడ్డి, గుండాల గోపీనాధరెడ్డి, కోలా ఆనంద్, మునిసుబ్రమణ్యం, సైకం జయచంద్రారెడ్డి, పృధ్వీరెడ్డి, వరప్రసాద్, పొనగంటి భాస్కర్, గాలిపుష్పలత, సింగంశెట్టి సుబ్బరామయ్య, పిసి రాయల్, రాటకొండ విశ్వనాధ్, అక్కినపల్లి మునికృష్ణయ్య తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన లీలామహల్ కూడలికి చేరుకున్నారు. అక్కడ కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసిపుష్పాంజలి ఘటించారు. అక్కడ నుండి నగరవీధుల్లో భారీప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కచ్చపి ఆడిటోరియంలో జరిగిన సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాధవ్ మాట్లాడారు. తిరుపతిని పూర్తిస్థాయిలో కేంద్రం 100 కోట్ల రూపాయలు స్మార్ట్సిటీ నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

Andhra Pradesh Breaking News in Telugu Latest News in Telugu religious tourism spiritual corridor Telugu News Temple Tourism tirupati

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.