हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Tirupati: ఆర్టీసీ కొత్త డిస్పెన్సరీ: 6 వేల కుటుంబాలకు ఆరోగ్య సేవలు

Sushmitha
Telugu News: Tirupati: ఆర్టీసీ కొత్త డిస్పెన్సరీ: 6 వేల కుటుంబాలకు ఆరోగ్య సేవలు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీని నిర్మించింది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ నెల 30న ఈ డిస్పెన్సరీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 Read Also: Acid Attack:ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో అనూహ్య మలుపు

భవన నిర్మాణం, లబ్ధిదారులు

తిరుపతిలోని(Tirupati) అలిపిరి డిపో సమీపంలో 1.3 ఎకరాల స్థలంలో రూ.3.89 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని జీ+3 అంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్, మొదటి అంతస్తులో డిస్పెన్సరీ, రెండు, మూడు అంతస్తుల్లో గెస్ట్‌హౌస్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, రోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా లిఫ్ట్‌ను కూడా అమర్చారు. ఒకేసారి 50 మందికి పైగా కూర్చునేలా విశాలమైన వెయిటింగ్ హాల్, ఫార్మసీ, ఓపీ కేంద్రం, వైద్యుల కోసం ప్రత్యేక గదులు వంటి సకల సౌకర్యాలు కల్పించారు. ఈ కొత్త డిస్పెన్సరీ ద్వారా తిరుపతి జిల్లాలోని 11 డిపోల సిబ్బందితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కలిపి దాదాపు 6,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

Tirupati

ప్రారంభోత్సవం, వైద్య సేవలు

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నారు. ఇప్పటికే ఉన్న డిస్పెన్సరీ ద్వారా రోజుకు సుమారు 100 మందికి ఈసీజీతో పాటు, సెమీ ఆటోమోటివ్ ఎనలైజర్ ద్వారా 30 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. దీనితో పాటు నెలకు సుమారు రూ.3 లక్షల విలువైన మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఈ సేవలు ఇకపై కొత్త డిస్పెన్సరీలో కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

కొత్త డిస్పెన్సరీ ఎక్కడ నిర్మించారు?

తిరుపతిలోని అలిపిరి డిపో సమీపంలో నిర్మించారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం ఎంత?

రూ.3.89 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870