తిరుపతి (Tirupati) లోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో చోటుచేసుకున్న విద్యార్థి నేతల కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో నటుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
Read Also: Meenakshi Chowdhury: కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి ఎంట్రీ?
కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు
ఇటీవల MBUలో ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాలు నిరసనలు చేయగా, SFI నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు, విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్ను ఏ1గా, విష్ణును ఏ2గా, మోహన్ బాబును ఏ3గా పేర్కొన్నారు. ఇప్పటికే PROతో పాటు పలువురు బౌన్సర్లను అరెస్టు చేశారు.
కిడ్నాప్ వ్యవహారంపై తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. కాలేజీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు బయటపెడితే కిడ్నాప్ చేస్తారా.. మీ కాలేజీలో విద్యార్థులకు ఇదే నేర్పుతున్నారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: