Tirupati News: తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ(Mannuru Sugunamma) నివాసం వద్ద ప్రజాధర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరానికి చెందిన ప్రజలు పాల్గొని 54 అర్జీల రూపం లో తమ సమస్యలను వినిపించారు. కొన్నింటిని సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ , మునిశేఖర్ రాయల్ , ఆముదాల తులసి రామ్వి , విశ్వనాధం ,పార్లమెంట్ నాయకులు రేవతి గారు, హేమావతి , సుజాత మ్మ,మురళి , ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: