తిరుపతి,ప్రభాతవార్త ప్రతినిధి: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం(Tirupati) జాతీయ సైన్స్ దినోత్సవం వేడుక్ ను పురస్కరించుకొని శుక్రవారం ” స్కూల్ ఆఫ్ సైన్సెస్ ” ఆధ్వర్యంలో గౌరవనీయమైన ఉపకులపతి ప్రొఫెసర్ . వి. ఉమా చేతుల మీదుగా ” సైన్స్ ప్రదర్శన” ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైన్స్ ను “ల్యాబ్ టు ల్యాండ్” అనగా సైన్స్ ను పరిశోధనశాలకే పరిమితం కాకుండా ముందుకు తీసుకురావాలని ముఖ్యంగా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు.
Read also: AP Crime: చెల్లి ప్రేమ వివాహం.. యువకుడిని కొట్టి చంపిన అన్నదమ్ములు
నూతన ఆవిష్కరణలకు దోహదం
ఈ ప్రదర్శనలో ఆచరణాత్మక ప్రయోగాలు మరియు ఇంటరాక్టివ్ కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తాయన్నారు. ఈ ప్రదర్శన లో భౌతికశాస్త్రం, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, జీవశాస్త్రం, అప్లైడ్ మైక్రో బయాలజీ వంటి విభాగాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. కన్వీనర్, జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు మరియు సైన్స్ డీన్ ప్రొఫెసర్.టి.సుధ, మాటలాడుతూ ఈ ప్రదర్శన రెండు రోజులపాటు ఉంటుందని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగినది మరియునేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయని కుడా తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: