Tirupati : భక్తులు కానుకలుగా సమర్పించి లెక్కించే పరకామణి(Parakamani theft case) భవనం నుండి అమెరికన్ డాలర్లు చోరీ కేసులో హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ చోరీ కేసులో లోక్అదాలత్తో రాజీకుదుర్చుకోవడం చిన్నవిషయమేమీ కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వాఖ్యలు చేసింది. ఈ కేసులో సింగిల్ జడ్జి(Single Judge) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్పై ధర్మాసనం విచారణ చేపట్టింది.
Read Also: Tirumala: నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

అప్పీల్పై విచారణ వాయిదా
విచారణలో సతీశ్కు సంబంధించిన కేసు లోక్అదాలత్లో రాజీకీ అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. సింగిల్ఆడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని, అది కేవలం ప్రాధమిక అభిప్రాయం మాత్రమేనని పిటిషనరు(Petitioner) ప్రశ్నించింది. ఆలయాల ప్రయోజనాలను కాపాడటంలో కోర్టులే మొదటి సంరక్షకులుగా వ్యవహరిస్తాయని ధర్మాసనం స్పష్టంచేసింది. పరకామణి చోరీ వంటి తీవ్రమైన కేసులో రాజీకుదుర్చుకోవడాన్ని అంత తేలిగ్గా తీసుకోలేమని అభిప్రాయపడింది. రవికుమార్ దాఖలు చేసిన అప్పీలుపై తదుపరి విచారణను ఈనెల 11వ తేదీగురువారానికి వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: