విద్యార్థుల రక్షణకు ప్రథమ ప్రాథాన్యతనిస్తాం: రిజిస్ట్రార్ ఆర్కె శుక్లా
తిరుపతి : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో (National Sanskrit University) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణకుమార్ విద్యార్థినిపట్ల ప్రవర్తించిన తీరుపై తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్ రజినీకాంతుక్లా ఫిర్యాదు మేరకు వెస్ట్ పోలీసులు 183/2025 కేసు నమోదైందని ఎస్పీ కార్యాలయం తెలిపింది. దీనిపై విచారణకు తిరుపతి డిఎస్పీ భక్తవత్సలంను దర్యాప్తు అధికారిగా, ఇద్దరు మహిళ ఎస్ఐలను సహాయ అధికారులుగా నియ మించారు.
Read also: Tirupathi : విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి

Police case registered over incident
అతనిని సస్పెన్షన్ చేసినట్లు
తిరుపతి జిల్లా పోలీసులు ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణచేసి దర్యాప్తు పూర్తయ్యాక సంబంధిత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. యుజిసి నిబంధనలననుసరించి (ఐసిసి) ఫిర్యాదులపై అంతర్గత విచారణ కమిటీ నియమించబడిందని, ఈ కమిటీ అంతర్గత విచారణ చేపట్టి నివేదికను విశ్వవిద్యాలయంకు అందజేయనుంది. విశ్వవిద్యాలయం ఎప్పుడూ విద్యార్థుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని శుక్లా తెలిపారు. కాగా విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన అతనిని సస్పెన్షన్ చేసినట్లు, విద్యార్థి గర్భందాల్చిన మాట అవాస్తవమని రిజిస్ట్రార్ ప్రకటనలో తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: