Tirupati driving schools : తిరుపతి జిల్లా, తిరుపతి ప్రభాతవార్త ప్రతినిధి ఈరోజు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో తిరుపతి నగరంలో అన్ని డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రియల్ టైం గవర్నెన్స్ ద్వారా రవాణా శాఖ సేవలు పూర్తిగా పర్యవేక్షణలో ఉన్నాయి.
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం ద్వారా అన్ని సేవల సంతృప్తి స్థాయిలను రికార్డ్ చేస్తూ రవాణా శాఖ పనితీరు పట్ల స్పందన నమోదు కావడం జరుగుతుంది. ఈ తరుణంలో తక్షణ సమావేశం ఏర్పాటుచేసి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ కొన్ని సూచనలు ఇచ్చారు. మోటార్ సైకిల్ , కారు సంబంధిత ఎల్ ఎల్ ఆర్ ఫీజు 410 రూపాయలు , మరియు డ్రైవింగ్ లైసెన్స్ కు రెండు రకాల వాహనాలు కలిపి 1260 రూపాయలు మరియు నిర్దేశించిన సర్వీస్ ఛార్జ్ మాత్రమే చెల్లించాలని ఆదేశించారు.
Madanapalle Crime: బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు
డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు నిర్దేశించిన ఫీజు అంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి హెచ్చరించారు. ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సిస్టం ద్వారా అన్ని సేవలకు సంబంధించిన లావాదేవీలను, అధికారుల పనితీరులను సంబంధిత పౌరుల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుందనితెలియజేస్తూ, ఫీజుల వసూళ్లలో పారదర్శకత పాటించాలని పౌరుల సేవల పట్ల నిర్దేశిత నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.
అనధికారంగా నడుపుతున్న డ్రైవింగ్ స్కూల్స్ పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అతికానాజ్, మోహన్ కుమార్, ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత పరిపాలన అధికారులు విజయ్ కుమార్ మరియు విజయ్ ప్రశాంతి పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: