Latest News: Tirupati Crime News: భార్య కాపురానికి రావట్లేదని భర్త ఏం చేసాడంటే?

Read Time:  1 min
Tirupati Crime News
Tirupati Crime News
FONT SIZE
GET APP

ఇటీవలి కాలంలో సమాజంలో చిన్న చిన్న సమస్యలకే పెద్ద నిర్ణయాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కోపం, నిరాశ, మనోవేదన వంటి భావోద్వేగాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో చాలా మంది తాత్కాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కోరుతున్నారు. అలాంటి ఒక దారుణ సంఘటన తిరుపతి (Tirupati) జిల్లాలోని శ్రీకాలహస్తి (Srikalahasti) లో చోటుచేసుకుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Bihar Crime News: భార్యపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన భర్త.. కారణం ఏంటంటే?

తీవ్రగాయాలతో రక్తపుమడుగులో పడిఉన్న బాధితుడిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రి (Ruya Hospital) కి తీసుకెళ్లారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తికి పట్టానికి చెందిన నరసింహ అనే వ్యక్తిలో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది.

Tirupati Crime News
Tirupati Crime News

హాస్పిటల్‌కు తరలించారు

అయితే ఇటీవల భార్యభర్తల కొన్ని గొడవలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన నరసింహ (Narasimha) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసింది. కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

అప్పుడే ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న నరసింహను చూసి షాక్‌ అయ్యారు. వెంటనే అంబులెన్స్ సహాయంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. అక్క నరసింహను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి తిరుపతి (Tirupati) రుయా హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం నరసింహా ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.