తిరుమల (TTD) పవిత్ర క్షేత్రంలో డ్రోన్ సంచారం మరోసారి హంగామా సృష్టించింది. శుక్రవారం శిలాతోరణం ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగరేయడం భక్తుల దృష్టికి పడడంతో వెంటనే టీటీడీ విజిలెన్స్కు సమాచారం వెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది నిమిషాల్లో అక్కడికి చేరుకుని ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Read also: Chandrababu: పార్వతీపురం పీటీఎంలో సీఎం విద్యా మార్పులకు నాంది

TTD gives clarity on drone
డ్రోన్ ఎగరేసిన వారు ఇస్కాన్కు చెందిన
తర్వాత టీటీడీ అధికారుల నుండి స్పష్టత వచ్చింది. డ్రోన్ ఎగరేసిన వారు ఇస్కాన్కు చెందిన సులక్షణ దాస్, అర్జున్ దాస్ అని వెల్లడించింది. ఫారెస్ట్ మరియు విజిలెన్స్ సిబ్బంది వారిని గుర్తించి స్థానిక పోలీసులకు అప్పగించారని టీటీడీ అధికారిక సమాచారం తెలిపింది. డ్రోన్లో రికార్డ్ అయిన విజువల్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పింది.
ఇక మరోవైపు శ్రీవారి దర్శనాలపై ముఖ్య గమనికను టీటీడీ ప్రకటించింది. డిసెంబర్–జనవరి నెలల్లో జరిగే పర్వదినాల దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని తేదీల్లో రద్దు చేసింది.
డిసెంబర్ 23, 29 తేదీలతో పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు కూడా ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. అలాగే రథసప్తమి (జనవరి 25) రోజున కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: