📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Tirumala: దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటేడ్కమాండ్ కంట్రోల్ సెంటర్

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైకుంఠం 1 కాంప్లెక్స్లో ఏర్పాటు

తిరుమల : టిటిడి (TTD) ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతిరోజూ లక్షమందివరకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. వేలాదిమంది భక్తుల సమస్యలకు చెకె పెట్టేందుకు కృత్రిమమేధస్సు (ఏఐ)ను వినియోగించుకోవాలని చైర్మన్ బిఆర్ నాయుడు (BR Naidu) కార్యాచరణలోకి తీసుకువచ్చారు. ఎన్ఆర్ఎల దాతృత్వంతో దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాంట్ కంట్రోల్ సెంటర్(ఐసిసిసి)ను టిటిడి అందుబాటులోకి తీసుకువస్తోంది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1లోని 25వ నంబర్ కంపార్టుమెంట్లో ఈవ్యవస్థను ఏర్పాటుచేశారు. దీనిద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించడం వంటి చర్యలు చేపట్టనుంది. ఈ కేంద్రాన్ని సిఎం నేడు(గురువారం) ఉదయం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఏఐ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (AI Integrated Command Control Center) అందుబాటులోకి వస్తే పెద్ద డిజిటల్ స్క్రీన్, అన్ని విభాగాలకు చెందిన సిసి పుటేజీలు కనిపిస్తాయి.

కొత్తగా అమర్చిన సిసికెమెరాలతో

వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్నవాటితోబాటు కొత్తగా అమర్చిన సిసికెమెరాలతో అలిపిరి (Alipiri) వద్ద నుండే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత సమయం వారు నిరీక్షిస్తున్నారు, సర్వదర్శనం పరిస్థితి తదితర అంశాలను ఏఐ ట్రాక్చేస్తుంది.

ముఖగుర్తింపు పరికరంద్వారా భక్తులను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నా గుర్తించి సమాచారం అందిస్తుంది. భక్తుల ముఖకదలికలు(హావభావాలు) ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది.

Tirumala

కొండపై రద్దీ ఉన్న ప్రాంతాల్ని

క్యూలైన్లు, వసతి ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులలతో 3డి మ్యాపు (3D map), చిత్రాలతో చూపుతుంది. కొండపై రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్స్పట్లుగా చూపడంతోబాటు చర్యలకు సంకేతాల్నిస్తుంది. ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్దాడులు, టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే సామాజిక మాధ్యమాల్లో (social media) పెట్టే అనుచిత సమాచారాలను పోస్టులు, ఆన్లైన్లో తప్పుడు సమ అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలను తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.

అలాగే వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, క్యూలైన్లలో అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకువచ్చే సమీప మార్గాలను చూపుతుంది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ను బుధవారం టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు, అదనపు ఈఓ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, బోర్డుసభ్యులు శాంతారాం, నరేశ్, సివిఎస్ ఓ కెవి మురళీకృష్ణ, విఎస్ఐ వింగ్ ఎన్టీవిరామ్కుమార్ పరిశీలించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

AI integrated command control center Breaking News First in India ICCC latest news Pilgrim Management Smart Surveillance Technology Integration Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.