Tirumala Srivari Teppotsavam Day3: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.
Read Also: TTD Panchangam 2026-27: శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ
మూడు చుట్లు విహరించిన స్వామివారు
శనివారం సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల గుండా సాగి స్వామి పుష్కరిణి వద్దకు చేరుకుంది. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై అధిష్టించిన శ్రీ మలయప్ప స్వామి వారు పుష్కరిణిలో మూడుసార్లు విహరించారు. మంగళవాయిద్యాల మోతలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య ఈ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది.
మురిపించిన విద్యుత్ కాంతులు
]తెప్పోత్సవాల నేపథ్యంలో స్వామి పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దశావతారాలు, పాండురంగడు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల రూపాలతో ఏర్పాటు చేసిన లైటింగ్ కాంతులు పుష్కరిణిలో ప్రతిబింబిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, పలువురు బోర్డు సభ్యులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :