Telugu News: Tirumala: భక్తుల ఇబ్బందులపై రియల్ టైం ఫీడ్ బ్యాక్

Read Time:  1 min
Tirumala
Tirumala
FONT SIZE
GET APP

తిరుమల (Tirumala) ఏడుకొండల వేంకటేశ్వర స్వామికి ఇటీవల ముగిసిన సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు, అధి కారుల సమష్టి సహకారంతో విజయవంతంగా నిర్వహించగలిగామని టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణాళికా బద్దంగా ప్రతి ఒక్కరూ భగవంతుని సేవగా భావించి ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు, 2026 తాగునీయు, ఇతరత్రా సేవలందించారన్నారు. రానున్న ఏడాది బ్రహ్మోత్సవాలకు సిసికెమెరాలను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రం, రియల్ టైం ఫీడ్ బ్యాక్ తీసుకుని భక్తుల ఇబ్బందులను అంచనావేసి, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టేందుకు.

Read Also: Explosion: అమెరికా నగరంలో భారీ పేలుడు

Tirumala

ప్రణాళికలు రూపొందిస్తామని ఇఒ తెలిపారు. తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం వెనుక ఉన్న సహకారం, కృషిపై పోలీస్, టిటిడి విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, మీడియాప్రతినిధులతో కలసి తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం మధ్యాహ్నం సూచనలు, సలహాలతో బాటు సమీక్ష నిర్వహించారు. టిటిడి అదనపు చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, జెఈఒ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు, సివిఎసి కెవి మురళీకృష్ణ, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా టిటిడి ఇఒ అనిల్కుమార్ మాట్లాడుతూ తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు దిగ్విజయం అయిన నేపధ్యంలో అదే స్పూర్తితో తిరుచానూరు శ్రీపద్మావతిఅమ్మవారి(Brahmotsavams) బ్రహ్మోత్సవాలను, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాల్లో ఈ సారి ఎటుచూసినా సానుకూల వాతావరణం కనిపించిందని అన్నారు. టిటిడి కల్పించిన సౌకర్యాలపై భక్తులు, గ్యాలరీల్లోని, క్యూలైన్లలో భక్తులు వందశాతం సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హమన్నారు. సిఎం చేసిన పలు సూచనలతో, జిల్లా యంత్రాంగం, టిటిడి వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు,భక్తులు, మీడియా సమష్టిసహకారంతో విజయవంతం అయ్యాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.