📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Telugu News: Tirumala: పరకామణి చోరీ కేసు రికార్డులు హైకోర్టుకు

Author Icon By Sushmitha
Updated: October 16, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: శ్రీవారి భక్తులు భక్తివిశ్వాసాలతో సమర్పించే కానుకల లెక్కింపు కేంద్రం పరకామణి(Parakamani) నుంచి విదేశీ కరెన్సీ(Currency) చోరీ చేసిన కేసులో, సీఐడీ(CID) అధికారులు హైకోర్టుకు సమర్పించనున్న రికార్డులు కీలకం కానున్నాయి. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా తిరుమలకు చేరుకుని, తిరుమల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ నుండి ఈ కేసుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Read Also: Farmers: ఎట్టకేలకు నేటి నుండి మక్కల కొనుగోళ్లు

డీజీ పర్యవేక్షణ, రికార్డుల పరిశీలన

డీజీ రవిశంకర్ అయ్యన్నార్(DG Ravi Shankar Ayyannar) మంగళవారం టీటీడీ పరకామణి భవనాన్ని సందర్శించి, లోపల కరెన్సీ నోట్లు, నాణేల లెక్కింపు ప్రక్రియ, భద్రత అంశాలపై పరిశీలించారు. ఈ కేసుపై తిరుమల పోలీసు, విజిలెన్స్ అధికారులతో చర్చించి విచారణ చేపట్టారు. 2023 మార్చిలో జరిగిన ఈ చోరీ కేసు వివరాలను తిరుమల పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న అయ్యన్నార్, రెండు రోజుల్లో ఈ రికార్డులను హైకోర్టుకు అప్పగిస్తామని తెలిపారు.

హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

పోలీసులు ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు చట్టపరంగానే సాగించారా? లేదా ఏదైనా అక్రమాలు జరిగాయా? అనే విషయంపై ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం వెలువడించే నిర్ణయంపై ఆధారపడనుంది. సీఐడీ డీజీ ప్రత్యేక బృందం రికార్డులు హైకోర్టుకు(High Court) సమర్పించిన తర్వాత తదుపరి ఏం జరగనుందనే ఉత్కంఠ టీటీడీలో, పోలీసు శాఖలో నెలకొంది. ఈ రికార్డుల్లోని కీలక ఆధారాలపై తదుపరి చర్యలు, సూత్రధారులెవరు అనేది తేలే అవకాశం ఉంది.

పరకామణి చోరీ కేసు రికార్డులను ఎవరు స్వాధీనం చేసుకున్నారు?

సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ రికార్డులను ఎవరికి సమర్పించనున్నారు?

ఈ రికార్డులను హైకోర్టుకు సమర్పించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CID investigation Google News in Telugu High court Latest News in Telugu Parakamani theft police records. Telugu News Today tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.