हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: Tirumala: విస్తుగొలుపుతున్న పరకామణి చోరీ కేసు

Saritha
Latest news: Tirumala: విస్తుగొలుపుతున్న పరకామణి చోరీ కేసు

సిఐడికి దిమ్మతిరుగుతున్న అవినీతి బాగోతం

తిరుమల : ఏడు కొండలస్వామికి భక్తులు సమర్పించే కానుకలు పరకామణి లెక్కింపులో విదేశీ కరెన్సీ, నోట్లను చోరీ చేసిన కేసు సిఐడిని విస్తుగొలిపిస్తోంది. నిందితుడైన (Tirumala) రవికుమార్ పరకామణి భవనంలో పర్యవేక్షణ చేసే డిప్యూటీ ఇఒ, సూపరింటెండెంట్, విజిలెన్స్ విభాగం అధికారులను మభ్యపెట్టి పెద్దజీయంగార్ అండతో ఆడిందే ఆట చేసిందే చోరీ అన్నట్లు ఎవరినీ లెక్కచేయ నితనంగా వ్యవహరించాడనేది సిఐడి అధికారులు తెలుసుకున్న విషయాలు. ఈ విషయాలతో ఎంత కాలంగా పరకామణిలో చోరీ చేస్తున్నాడనేది మాత్రం ఆరా తీస్తున్నారు. తిరుమలలో 2022 ఆగస్టు వరకు హుంఢీ కానుకల లెక్కింపు శ్రీవారి ఆలయంలోపల జరిగేది. అక్కడ ఏం జరుగుతోందనేది మరింత నిశితంగా కనిపెట్టేవారే లేకపోయారనేది అందిన సమాచారం. అదేగాక టిటిడి ఉద్యోగులు, శ్రీవారి పరకా మణిసేవకులు ఆలయంలోపల పరకామణిలో లెక్కించి ఆ తరువాత మహద్వారం గేట్నుండి వెలుపలకు వెళ్ళేవారు. సేవకులు కూడా బయోమెట్రిక్ ప్రవేశంలో ఆలయంలోపలకు చేరుకునేవారు. పైగా కొంత ఇరుకుగా ఉండే ఆలయంలో పరకామణి కేంద్రాన్ని 2022లో విశాలమైన వంద కోట్లు రూపాయలు పైగా దాత సహకారంతో నిర్మించిన భవనంలోకి ఆలయం వెలుపలకు మార్చారు.

 Read also: గోవిందా ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది!

Tirumala
Tirumala: విస్తుగొలుపుతున్న పరకామణి చోరీ కేసు

రవికుమార్ స్థిరాస్థులు, భవనాల అన్వేషణలో సిఐడి బృందాలు చురుకుగా

పరకామణి భవనం (Tirumala) మార్చిన తరువాత అక్కడ నాణేల, కరెన్సీ నోట్లు లెక్కింపు స్పష్టంగా తెలిసేలా సిసికెమెరాలు రికార్డు జరుగుతుంది. రోజువారీ దినచర్యల్లో భాగంగా పరకామణిలో గుమస్తా సివి రవికుమార్ కూడా 2023 ఏప్రిల్లో విధులు ముగించుకుని తన పంచకు కుట్టించుకున్న రహస్య అరలాంటి జేబుల్లో విదేశీ కరెన్సీని దాచుకుని తనిఖీలు లేకుండా బయటకు వచ్చేసేవాడనేది సిఐడి రాబట్టిన కీలక సమాచారం. ఇలా ఎంతకాలంగా కొన్ని వందల కోట్ల రూపాయలు చోరీచేసి ఆ సొమ్ముతో స్థిరాస్థులు, భవనాలు నిర్మించాడనేది కీలకంగా అందిన విషయాలు. అయితే 2023 ఏప్రిల్లో జరిగిన చోరీ కేసులో మాత్రమే విజిలెన్స్ ఏవిఎస్ ఒ సతీశ్ కుమార్ పట్టుకోవడం జరిగింది. తదనంతరం పరిణామాలతో ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. విచారణలో ఐదు టీమ్లు క్షేత్రస్థాయిలో విషయాలు సేకరించడం, దాని ఆధారంగా శ్రీవారి కానుకగా టిటిడికి ఇచ్చిన 14కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను నేరస్తుడి నుండి అందించినా, వాటి విలువ మార్కెట్లో 40కోట్లు చేస్తుందని సిఐడి డిజి అయ్యన్నార్ మీడియాకు వెల్లడించడం తెలిసిందే.

అయితే తిరుపతి, చెన్నై, కర్నాటక, హైదరాబాద్లో రవికుమార్ ఆస్తులు లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసును రాజీచేసి అరెస్టు కాకుండా తప్పించిన గత టిటిడి(TTD) బోర్డు పెద్దలు, పోలీసు అధికారులకు చర్యలు తప్పవనే భయం కలుగుతోంది. నిందితుడు రవి కుమార్కు సహకరించి వెన్నంటి ఉండి సూత్రధా రులుగా సహకరించిన వారిని విచారణ చేసే దిశగా వేగవంతం చేస్తున్నారు. రవికుమార్ విషయంలో సహకరించిన గత విజిలెన్స్, గత టిటిడి పెద్దలు, గత పోలీస్ అధికారుల పాత్రను తేల్చనున్నారు. తదుపరి డిసెంబర్ 2 తరువాత అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందనేది తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870