📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Tirumala: పరకామణి కేసు రాజీలో టిటిడి పెద్దలు!

Author Icon By Saritha
Updated: November 13, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీలపై దృష్టి పెట్టిన సిఐడి విచారణకు పిలిచే అవకాశం

తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు కానుకలు లెక్కించే పరకామణి నుండి విదేశీ కరెన్సీ చోరీ కేసు, తదనంతరం లోక్అదాలత్లో రాజీజరగడం వంటి కీలక పరిణామాల వెనుక గత టిటిడి పెద్దలు ఉన్నారనే విషయం సిఐడి దృష్టికి వచ్చిందని తెలుస్తోంది. ఈ(Tirumala) బాగోతంలో రానున్న రెండుమూడురోజుల్లో మాజీ టిటిడి(TTD) పెద్దలతోబాటు మాజీ పోలీస్ అధికారిని విచారణకు పిలిచే అవకాశం ఉందని కీలక సమాచారం. పరకామణిలో చోరీ కేసు విషయంపై హైకోర్టు ఆదేశాలతో సివి గత ఏడెనిమిదిరోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన సిఐడి డిజి రవిశంకర్అయ్యన్నార్, ఎస్పీలు, డిఎస్పీలు ఐదు బృందాలు క్షేత్రస్థాయిలో సమాచారం రాబట్టారు. నిందితుడైన రవికుమార్ వ్యవహారంపైకూడా దాదాపు కీలక సమాచారం సేకరించింది. ఆయనకు సంబంధించిన ఆస్తులు, వాటి అంచనాలు వంటి విషయాలను రాబట్టింది. ఇప్పుడు కీలకంగా మారిన రాజీధోరణి వ్యవహారంలో కొందరు మాజీ పెద్దలపై దృష్టి సారించారు. ఇదేగాక తాజాగా బుధవారం సాయంత్రం టిడిపి నాయకులు సిఐడిడిజి రవిశంకర్అయ్యన్నార్ను తిరుపతిలో కలసి పరకామణి దొంగతనం కేసులో ముగ్గురుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు.

Read also: కేంద్ర మంత్రి సంతకంతో..99 లక్షల దోపిడి

డిసెంబర్ 2కి హైకోర్టుకు నివేదిక సమర్పించనున్న సిఐడి

ఈ కేసులో గత టిటిడి(Tirumala) చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, మాజీ ఇఒ ఏవి ధర్మారెడ్డి, ఓ పోలీస్ ఉన్నతాధికారి కలసి కుమ్మక్కై వాటాలు పంచుకున్నారని ఆరోపించారు. వీళ్ళే కేసు నీరుగార్చే ప్రయత్నం చేసి రాజీచేశారని విన్నవించారు. దీంతో ఇప్పుడు పరకామణి కేసులో కొత్త మలుపుతిరగనుంది. తిరుమల పరకామణిలో 2023 ఏప్రిల్లో జరిగిన చోరీ ఘటన, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలతో సిఐడి బృందం దర్యాప్తు వేగవంతంగా కొనసాగిస్తోంది. పూర్తి విషయాలు డిసెంబర్ 2కి హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. తిరుమలలో పరకామణి భవనం, కమాండ్ కంట్రోల్రూమ్, సిసిటివి దృశ్యాలు పరిశీలించారు. రవికుమార్ పాత్ర, 2023 ఏప్రిల్లో చోరీ జరిగిన ప్రాంతం, ఎలా పట్టుబడ్డాడు అనే వివరాల ఆధారాలు సేకరించి కొందరు అధికారులను విచారణ చేశారు. రవికుమార్కు సంబంధించి రికార్డుల మేరకు తిరుపతి, హైదరాబాద్, తమిళనాడు, కర్నాటకలో 50కోట్లరూపాయలకుపైగా విలువైన ఆస్తులు న్నట్లు కూడా గుర్తించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

CID investigation Foreign Currency Theft High court Latest News in Telugu parakamani case Telugu News tirumala tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.