తిరుమల : వైఖానస ఆగమోక్తంగా నిత్యకైంకర్యాలు, సేవలు జరిగే తిరుమల (Tirumala News) శ్రీవేంకటేశ్వం | స్వామి ఆలయంలో ఆగస్ట్ 5వతేదీ నుండి 7వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏదాడి శ్రావణమాసంలో ఈ పవిత్రోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో టిటిడి(TTD) ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చేపడతారు. ఆలయంలో పలురకాలుగా భక్తులవల్ల గానీ, ఆలయ అధికారులు, అర్చకుల వల్ల తెలిసీతెలియక చేసిన తప్పిదాలు, పొరబాట్టు వల్ల దోష నివృత్తికి ఈ పవిత్రోత్సవాలు జరిపించడం ఆనవాయితీ. ఆగస్ట్ 5వతేదీ నుండి మూడురోజులు జరిగే ఈ ఉత్సవాలకు 4వతేదీ సోమవారం రాత్రి అంకురర్పాణ కార్యక్రమం చేపడతారు. 5వతేదీ మంగళవారం ఉదయం నుండి 7వతేదీ గురువారం పవిత్రాలు సమర్పణతో ముగుస్తాయి. ప్రతిరోజూ ఉదయం శ్రీదేవిభూదేవిసమేత(Sridevi Bhudevi Sametha)
మలయప్పస్వామి ఉత్సవర్లకు విశేష స్నపనతిరుమంజన అభిషేకాలు జరిపిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కొన్ని ఆర్జితసేవలు రద్దయ్యాయి. పవిత్రోత్సవాలకు గృహస్థ భక్తులను అనుమతినిస్తారు.
Read also: