Tirumala ghee scam : పయ్యావుల కేశవ్ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంకు పునాది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వేసిందని, ఇందుకు స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, నెయ్యి నాణ్యత ప్రమాణాలను కావాలనే సడలించి అనర్హ సంస్థలకు టెండర్లు ఇచ్చారని విమర్శించారు.
2022లోనే మైసూరులోని CFTRI పరీక్షల్లో నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నట్లు నివేదిక వచ్చిందని, అయినా అప్పటి అధికారులు దాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాజాగా నమూనాలను NDDBకు పంపగా జంతు కొవ్వు కలిసినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, కీలక వ్యక్తుల ఖాతాలకు భారీ మొత్తాలు బదిలీ అయ్యాయని సిట్ దర్యాప్తులో బయటపడిందని తెలిపారు.
Read Also: Kuppam : టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు
ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ ప్రక్షాళన చేపట్టిందని, దోషులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడటమే తమ లక్ష్యమని, ఈ కేసులో కఠిన చర్యలు తప్పవని పయ్యావుల హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: