Tirumala: శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థమ్ తిరుమలకు (Tirumala) వస్తున్న లక్షలా దిమంది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు వడ్డించేందుకు దాతలకు అవకాశం కల్పించారు. ఈ పథకం క్రింద దాత ఒకరోజుకు 44లక్షలు రూపాయలు విరాళాలిస్తే దాత స్వయంగా వచ్చి వడ్డించే అవకాశమేగాక దాత పేరు ప్రదర్శన చేస్తారు. తిరుమలకొండపై భకులు ఆకలి అనేది తెలియకుండా అక్షయపాత్రలా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి రుచిగా అన్నప్రసాదాలు (Annaprasadas) మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (Tarigonda Vengamamba) అన్నప్ర సాదం భవనంలోనేగాక మరికొన్ని ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఇందుకుగాను ఒకరోజు విరాళ పథకం ప్రారంభించి, ఉదయం అల్పాహారం కోసం 10లక్షలు రూపాయలు, మధ్యాహ్నం భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17లక్షలు రూపాయలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. అన్నప్రసాద భవనంలో ఉద యం 8.30గంటల నుండి 10.30గంటల వరకు చట్నీతో కలిపి ఉప్మా, పొంగళి, సేమ్యా ఉప్మా అందిస్తారు. ఉదయం 11గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు, తిరిగి సాయంత్రం 5గంటల నుండి రాత్రి 11.30గంటల వరకు చక్కెరపొంగలి, చట్నీ, అన్నం, కూర, సాంబారు, రసం, మసాలవడ మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు. ఎస్వీఅన్నప్రసాదం ట్రస్ట్కు విరాళాలు కూడా 2,200కోట్ల రూపాయలకు చేరిన విషయం విదితమే. ఈ ఆదాయంపై వచ్చే వడ్డీతోనే ఇప్పుడుఎంతో నాణ్యతతో, రుచిగా అన్నప్రసా దాలు భక్తులకువడిస్తున్నారు. రోజుకు లక్షమం దివరకు భక్తులు అన్నప్రసాదాలను భక్తితో స్వీకరిస్తున్నారు.
తిరుమలలోని 7 కొండలు ఏమిటి?
కొండల చుట్టూ శేషాచలం శ్రేణిలోని ఏడు శిఖరాలు, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషబాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి అనే తూర్పు కనుమలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరుని ఆలయం[2] ఏడవ శిఖరం (వెంకటాద్రి)పై ఉంది.
తిరుపతి తిరుమల CEO ఎవరు?
శ్రీ. తిరుమల ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా జె.శ్యామలరావు ఆదివారం టిటిడి ఇఓ (ఎఫ్ఎసి) శ్రీ ఎవి ధర్మారెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: CH. Baburao: ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర: సిహెచ్.బాబూరావు