22న వర్చువల్ సేవా టిక్కెట్లు
లక్కీడిప్ విధానంలో 23న శ్రీవాణి టిక్కెట్లు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి రోజువారీ, వారాంతపు ఆర్జితసేవలకు సంబంధించి డిసెంబర్ నెలకోటా టిక్కెట్లు గురువారం ఉదయం నుండి టిటిడి (TTD) ఆన్లైన్లో విడుదల చేస్తోంది. ఇందుకు టిటిడి ఐటి విభాగం (TTD IT Department) అన్ని ఏర్పాట్లుచేసింది. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల దర్శన సమయం సాయంత్రం 4.30గంటలకు నిర్ణయించింది. అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్ లక్కీడిప్లో జారీచేస్తారు.
నేడు 18వతేదీ ఉదయం 10గంటలకు ఆన్లైన్లో ఆర్జితసేవా టిక్కెట్లు (Arjitha Seva Tickets) విడుదల చేస్తే 20వతేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లు పొందిన భక్తులు 20వతేదీ నుండి 22వతేదీ మద్యాహ్నం 12గంటలలోపు సొమ్ము చెల్లించి టిక్కెట్లు మంజూరవుతాయి. 22వ తేదీ ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం,సహస్రదీపాలంకారసేవల టిక్కెట్లను విడుదల చేయనుంది.

దర్శన కోటా
22న ఆన్లైన్లో వర్చువల్ సేవా టిక్కెట్ల (Virtual service tickets) ను మధ్యాహ్నం 3గంటలకు విడుదలవుతాయి. శ్రీవాణి టిక్కెట్లు 23న ఉదయం 11గంటలకు, వృద్ధులు దివ్యాంగులు దర్శన కోటా ఆగస్ట్ 23న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు. 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా 24న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. గదుల కోటాను మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఆన్లైన్లో స్వామివారి దర్శన టిక్కెట్లును “టిటిదేవస్థానమ్స్. ఎపి. జివొవి. ఇన్”వెబ్ సైట్గాద్వారా బుక్చేసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: