Tirumala Darshan Update: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో పానీయాలు, ఆహార సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Tirumala: తిరుమలలో విషాదం.. భక్తురాలిని కాటేసిన పాము

ఆదివారం దర్శించుకున్న భక్తులు సంఖ్య
వివరాల ప్రకారం.. ఆదివారం మొత్తం 76,506 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,049 మంది తలనీలాలు సమర్పించుకోగా, హుండీ ద్వారా రికార్డు స్థాయిలో రూ. 4.20 కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు రోజు (శనివారం) 82,043 మంది భక్తులు దర్శనం చేసుకోగా, రూ. 3.74 కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. శనివారంతో పోలిస్తే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గినా, హుండీ ఆదాయం పెరగడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: