సాంకేతికతతో క్యూలైన్లనిర్వహణ అభినందనీయం
తిరుమల : ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుండి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య రెట్టింపవుతున్న సమయంలో టిటిడి (TTD) అధికారులు భక్తులకు మరింత అదనపు వసతి కల్పించడం సంతోషనీయమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సిఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) అన్నారు.
CM Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేల గైర్హాజరుపై సిఎం సీరియస్
102కోట్లతో అధునాతన సదుపాయాలతో నిర్మించిన పిఎసి 5(వెంకటాద్రినిలయం)ను గురువారం ఉదయం టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు, రాష్ట్రమంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, టిటిడి ఈఓ అనిల్కుమార్ సింఘాల్తో కలసి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సిఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా తిరుమల (Tirumala) కు వచ్చిన భక్తులకు ఇక్కడ వసతి కల్పిస్తారన్నారు.
వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో
ఒకేసారి నాలుగువేలమంది భక్తులకు ఉచిత సౌకర్యం కల్పిస్తారు. 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలూ వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో యాత్రికుల వసతిసముదాయం ఉందన్నారు. 1,400మంది భక్తులకు ఒకేసారి అన్నప్రసాదాలు వడ్డించే రెండు హాళ్ళు, కల్యాణకట్ట సదుపాయం కల్పించారన్నారు.
వసతి గృహం బుకింగ్ కౌంటర్లో (booking counter) కి వెళ్ళిన ఉపరాష్ట్రపతి, సిఎం అక్కడే ఓ భక్తురాలికి తొలి వసతి బుకింగ్ టోకెన్ను అందించారు. ఈ ప్రాంగణంలోనే ఏర్పాటుచేసిన వ్యర్థాల నుండి డబ్బువచ్చే యంత్రాన్ని వారిరువురూ పరిశీలించారు. టిటిడి ఏర్పాటుచేసిన విధానం బావుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. తిరుమల పోటులోనూ సాంకేతిక ఆథారిత యంత్రాలు అందుబాటులోకి రావడంతో భక్తులకు నాణ్యత ప్రసాదాలు తక్కువ సమయంలో ఎక్కువ ప్రసాదాన్ని సిద్ధం చేసే వీలుకలిగిందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: