📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

Tirumala: బ్రేక్ దర్శనం సిఫారసును పునరుద్ధరిస్తూ నిర్ణయం

Author Icon By Sharanya
Updated: May 16, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల (Thirumala) శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు మారుతూ ఉంటూ, టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) వారికి సులభతరం చేసే దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమల చేరుతారని భావించి, ఈ సీజన్‌లో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే దృష్టితో పలువురు వీఐపీలకు ఇచ్చే సిఫారసు లేఖలను తాత్కాలికంగా రద్దు చేసింది. కానీ రద్దీ అంచనాలకంటే తక్కువగా ఉండటంతో, భక్తులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు తిరిగి బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలను పునరుద్ధరించింది. సామాన్య భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఆ సమయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.

వేసవి రద్దీపై అసలు పరిస్థితి

2025 వేసవిలో భక్తుల రద్దీ గత సంవత్సరాల కంటే కొంత తక్కువగా నమోదయ్యింది. వారాంతంలో మాత్రం ఎక్కువగా ఉంటోంది. దీంతో మిగిలిన రోజుల్లో శ్రీవారి భక్తులకు సులభ దర్శనం అందుతోంది. ఈ ఏడాది వేసవి సెలవుల్లో భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు తగినట్లుగా తగిన ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా వీఐపీ సిఫార్సు లేఖలు రద్దు చేయడంతో పాటు బ్రేక్‌ దర్శన వేళల మార్పు ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతీ ఏటా మే నెలలో కని పించే రద్దీకి భిన్నంగా ఈ సారి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెలలో 14వ తేదీ వరకు దాదాపు 13 రోజుల్లో 6 రోజులు 70,000 మంది లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

బ్రేక్ దర్శనాల్లో మార్పులు

టీటీడీ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రేక్ దర్శనాల సమయాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని మార్పులు చేపట్టింది. మూడు రోజులు 70,000 మంది పైన మిగిలిన 4 రోజులు మాత్రమే 80,000 మంది పైన భక్తుల రద్దీ కనిపించగా వీరికి 6 నుంచి 10 గంటల్లోపే సర్వదర్శనం పూర్తయింది. ఇక టీటీడీ బ్రేక్‌ దర్శన సమయాలను ఈ నెల మొదటి నుంచి అమలు చేస్తోంది. గురు, శుక్రవారాల్లో పాత వేళలే కొనసాగించి మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు 10.30 నుంచి 12.30 గంటల వరకు శ్రీవారి బ్రేక్‌ దర్శనం అమలు చేస్తోంది. 8.30 నుంచి 10.30 గంటల మధ్యన సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నారు. ఈ 2 గంటల్లో దాదాపు 7000 మందికి పైగా సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో 3-4 గంటల్లోనే దర్శనం పూర్తి చేసు కుంటున్నారు. సౌకర్యాలు వంటి అంశాల్లో కూడా టీటీడీ తగిన చర్యలు తీసుకుంది.

టీటీడీకి ప్రయోగాత్మక విధానం

వీఐపీ సిఫారసులు తగ్గించడంతో సామాన్య భక్తులకు దర్శనం మరింత అందుబాటులోకి వచ్చింది. తిరుమలలో శాంతియుత వాతావరణం నెలకొని, భక్తుల క్రమశిక్షణతో కూడిన ప్రవేశాలు, తక్కువ వేచి ఉన్న సమయం వంటి అంశాలు టీటీడీకి మెరుగైన పరిపాలనను సుసాధ్యం చేస్తున్నాయి.

Read also: TTD: మే 15 నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు పునఃప్రారంభం?

#BreakDarshan #Tirumala #TirumalaDarshan #Tirupati #ttd #TTDUpdates Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.