మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) పై ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సులు వివాదాస్పదంగా మారాయి. ఈ సిఫార్సుల్లో విశ్వవిద్యాలయ పరిపాలనా వ్యవస్థ, ఫీజుల నిర్మాణం, విద్యా ప్రమాణాలపై కొన్ని వ్యాఖ్యలు ఉండటంతో వివిధ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే, విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని MBU అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ చైర్మన్ మరియు నటుడు మంచు విష్ణు స్పష్టమైన వివరణ ఇచ్చారు.
Telugu News: Health:ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యానికి హానికరమా ?
మంచు విష్ణు ఈ వివాదంపై స్పందిస్తూ.. “APHERMC చేసిన సిఫార్సులు న్యాయపరంగా సవాలు చేయబడ్డాయి. హైకోర్టు ఇప్పటికే మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి అనుకూలంగా స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. మా వర్సిటీపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం ఇది. మేము పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా విద్యా సేవలు అందిస్తున్నాం. ఈ నిరాధారమైన వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పేర్కొన్నారు.
అదేవిధంగా, మంచు విష్ణు విశ్వవిద్యాలయ సామాజిక బాధ్యతలను కూడా ప్రస్తావించారు. “మోహన్ బాబు విశ్వవిద్యాలయం కేవలం విద్యా సంస్థ మాత్రమే కాదు, ఇది సేవా ధర్మాన్ని పాటించే కుటుంబం. అనేక మందికి ఉచిత విద్యను అందించాం. అనాథ పిల్లలను దత్తత తీసుకుని సంరక్షిస్తున్నాం. అలాగే, సైన్యం మరియు పోలీసు సిబ్బంది పిల్లలకు పూర్తి స్కాలర్షిప్ ఇస్తున్నాం” అని వివరించారు. ఈ ప్రకటనతో, విశ్వవిద్యాలయంపై ఉన్న ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్టుగా, సామాజిక బాధ్యతతో కూడిన విద్యాసంస్థగా MBU మరోసారి చర్చలో నిలిచింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/