📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Chandrababu Naidu : కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనన్న చంద్రబాబు

Author Icon By Divya Vani M
Updated: June 17, 2025 • 8:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నంలో టీడీపీ (TDP in Visakhapatnam) కార్యకర్తల సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని, వారు ఉన్నంత వరకు పార్టీ ఓడిపోదని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు అలిగినా కాడి వదిలేస్తారే కానీ వేరే పార్టీలోకి వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు.తెలుగుదేశం కార్యకర్తలు బాధపడే పరిస్థితిని ఇకనుండి రానివ్వనని చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యకర్తల అనుభవాలు, కష్టాలు వృథా కాకుండా చూస్తామని తెలిపారు. పార్టీ జెండాను ఎత్తి పెట్టి, నిస్వార్థంగా పని చేసిన వారు ఇక నుంచి మరింత ఆదరణ పొందుతారని స్పష్టం చేశారు.

కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే నాయకులు అన్న భావన కొనసాగుతుందన్నారు. ఇకనుంచి సగం రోజును ప్రజల కోసం, మిగిలిన సగం రోజును కార్యకర్తల కోసం కేటాయిస్తానని తెలిపారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.తెలుగుదేశం పార్టీకి కోటి మందికి పైగా సభ్యులున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ స్థాయిలో కార్యకర్తలు ఉన్న పార్టీ దేశంలో మరొకటి లేదన్నారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసానికి తగిన విధంగా పాలన అందిస్తామని చెప్పారు.

ఢిల్లీ వరకు ఎదిగిన తెలుగుదేశం పలుకుబడి

ఈసారి ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీ సాధించిందని, ప్రజలు నమ్మి ఓటేశారు అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా టీడీపీకి గౌరవం పెరిగిందని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగితే ఎలాంటి అడ్డంకులైనా దాటవచ్చని స్పష్టం చేశారు.

Read Also : T20 Cricket : అతి ఉత్కంఠభరిత పోరులో చివరకు నెదర్లాండ్స్ విజయం

APPolitics Chandrababu ChandrababuNaidu PoliticalLeadership PoliticalNews TDP activists TDPUpdates Telugu Desam Party Telugudesam Visakhapatnam Review

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.