తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం కలిగిన ఊరు ఉంది జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మల్దకల్. ఈ గ్రామ ప్రజలు ఇప్పటివరకు తిరుమలకు(TTD) వెళ్లే ఆచారం పాటించరు. కారణం, వారి గ్రామంలోనే స్వయంభువుగా వెలసిన లక్ష్మీవేంకటేశ్వర స్వామి, అనగా స్థానికులకు తిమ్మప్పగా పిలవబడే ఆలయం ఉండటం.
Read Also: Parenting Tips: ఎగ్ షెల్ పేరెంటింగ్ అంటే ఏమిటి?
తిమ్మప్పనే తిరుమల వేంకటేశ్వరుడిగా భావించి గ్రామస్తులు తరతరాలుగా తమ ఊరిలోనే స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ పౌర్ణమి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున తిరునాళ్లు జరుపుకుంటారు. అంతేకాదు, గ్రామంలో ఇళ్ల నిర్మాణంలో కూడా ఆలయానికి ప్రత్యేక గౌరవం ఇవ్వబడుతుంది. ఎవరి ఇల్లు కూడా దేవాలయం గోపురం కన్నా ఎత్తుగా ఉండకూడదనే నియమాన్ని అందరూ పాటిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: