📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Nara lokesh : ఓటమి బాధ తనలో కసిని పెంచింది – లోకేష్

Author Icon By Sudheer
Updated: July 7, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh).. 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి తనలో కొత్త ఉత్సాహాన్ని, కసిని పెంచిందన్నారు. అదే ప్రేరణతో 2024 ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించామన్నారు. నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలోని ఓటమి బాధను ఉత్సాహంగా మార్చుకుని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

విద్యాశాఖను స్వీకరించడం వెనుక ఉద్దేశం

లోకేష్ మాట్లాడుతూ, జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడం తనకు నచ్చే విషయం అని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్పించిన విద్యాశాఖ బాధ్యతను స్వీకరించానన్నారు. విద్య రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు దీని తొలి అడుగులు అని తెలిపారు. పాఠశాలల్లో ఆధునిక తరగతి గదులు, స్మార్ట్ బోర్డులు, టాయిలెట్లు, మల్టీ మీడియా సామాగ్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

పేదరిక నిర్మూలనకే P4 లక్ష్యం

లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మంచి సదుపాయాలు కల్పించాలన్నదే తమ లక్ష్యం అని తెలిపారు. తండ్రి చంద్రబాబు రూపొందించిన P4 (P4)మిషన్‌ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించిన లోకేష్, వారికి మరింత ఉత్తమమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

Read Also : APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో వెళ్లొచ్చు

2019 elections defeat lokesh 2024 elections Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.