గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన పునరాలోచనకు వస్తోంది. ఈక్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం.. మంత్రివర్గ ఉప కమిటీ (Sub-committee) ని నియమించింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించింది.
Read Also: Bapatla Railway Station: 21 కేజీల గంజాయి స్వాధీనం నిందితుడు అరెస్ట్
దీంతో కృష్ణా జిల్లాలోని నూజివీడు , కైకలూరు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయి. అయితే నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా (Krishna District) లో కలపాలంటూ ఆ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
తాజాగా మరో సారి ఈ రెండు ప్రాంతల విలీన ప్రతిపాదన అంశం తెర మీదకు వచ్చింది.ప్రస్తుతం నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను.. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో విలీనం చేసే అంశానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల ప్రజలతో పాటు ఆయ సంఘాలతో సంప్రదించి అభిప్రాయాలు సేకరించారు.

ప్రజలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు
దీని కన్నా ముందే తమను కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో కలపాలని ఈ రెండు ప్రాంతాల ప్రజలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.జిల్లాల విభజనకు పూర్వం ఈ రెండు నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేవి. నూజివీడు విజయవాడకు చాలా దగ్గర.
దీంతో ఆ ప్రాంత వాసులు.. చదువు, వాణిజ్యం, ఉద్యోగాల నిమిత్తం విజయవాడ నగరానికి వెళ్తారు. అయితే విభజన తర్వాత తమకు ఏలూరు జిల్లా అనుకూలంగా లేదని.. ఎన్టీఆర్లో కలపాలని ప్రజలు కోరినట్లుగా తెలిసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: