📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయం – షర్మిల

Author Icon By Sudheer
Updated: February 23, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు పెట్టుబడి కూడా రాని ధరలకు తమ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, క్వింటాకు రూ.15,000 నష్టంతో రైతన్నలు విలవిల్లాడిపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని గమనించి, రైతులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం మరింత బాధ పెడుతోందని ఆమె ఆరోపించారు.

కౌలు రైతులకు మరింత నష్టం

ప్రభుత్వం మిర్చి రైతులకు రూ.11,000 మద్దతు ధర ఇచ్చినట్లు ప్రకటించడం గప్పాలని, నిజానికి రైతులు ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి కూడా నష్టపోతున్నారని షర్మిల వివరించారు. కౌలు రైతులకు మరింత నష్టం ఏర్పడుతోందని, కేంద్ర ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధరను రూ.26,000గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని వెంటనే అమలు చేయాలని, మిర్చి రైతులకు బోనస్ ప్రకటించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మిర్చి రైతులకే కాదు, టమాటా రైతులకు కూడా తీరని కష్టాలు

ఇక, మిర్చి రైతులకే కాదు, టమాటా రైతులకు కూడా తీరని కష్టాలు వచ్చిపడ్డాయని షర్మిల అన్నారు. మార్కెట్లో టమాటా ధర తగ్గిపోవడంతో రైతులు కనీస పెట్టుబడిని కూడా రాబట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. టమాటా కిలోకు రూ.15 ధర ఉన్నా, రైతుకు మూడ్నాలుగు రూపాయలు కూడా రావడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే టమాటా రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ధరల నియంత్రణ కోసం తగిన చర్యలు అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

Google news mirchi farmers Mirchi Price Mirchi yard ys sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.