📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

CM Chandrababu: శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

Author Icon By Anusha
Updated: December 19, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు 200 చొప్పున కొత్ పింఛన్‌లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించారు. పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఓ కలెక్టర్ల కలెక్టర్ల సదస్సులో చెప్పగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. ఒక్కో జిల్లాకు 200 కొత్త పింఛన్‌లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చారు.

Read Also: AP: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

The CM gave good news.. 200 pensions for the district..

సానుకూలంగా స్పందించారు

ఈ 200 కొత్త పింఛన్‌లు కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులు, దివ్యాంగులకు మంజూరు చేస్తారు. ఈ కొత్త పింఛన్‌లు మంజూరుపై ఇంఛార్జ్ మంత్రి & జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. పింఛన్ల విషయంలో ఇబ్బందిపడుతున్నవారికి న్యాయం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పింఛన్‌ల మంజూరు విషయంలో తమకు విచక్షణాధికారం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ సదస్సులో ప్రస్తావించారు.

పీజీఆర్‌ఎస్‌కు వచ్చే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్‌, సర్వం కోల్పోయి వచ్చిన వారికి న్యాయం చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. పింఛన్ల మంజూరు విషయంలో ప్రత్యేకంగా అధికారాలు కల్పించాలని కోరారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు కొత్తగా 200 పింఛన్‌ల చొప్పున.. ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఎంతోకాలంగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఊరట దక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.