తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (TG Municipal Election) ప్రచారం ఊపందుకున్న వేళ, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచార కార్యక్రమాలు అనివార్య కారణాలతో రద్దయ్యాయి. ఇటీవల జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది. శనివారం, ఆదివారం ఆయన ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే, ఈ ప్రచారం రద్దు కావడం చర్చనీయాంశమైంది.
Read Also: Soil testing : భూసార పరిరక్షణతోనే సాగు ముందడుగు

బీజేపీ అభ్యర్థులకు మద్దతుగానూ పవన్ ప్రచారం
శనివారం, ఆదివారం ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ను సైతం ఖరారు అయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల బరిలో దిగిన తమ పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేసేందుకు పవన్ కల్యాణ్ (TG Municipal Election) రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించాలని భావించారు. ఈ మేరకు తమ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించారు. అంతేకాదు, తన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగానూ పవన్ ప్రచారం చేయాలనుకున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు,
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పవన్ను కలిసి ఆహ్వానం పలికారు.పట్టణ ఓటర్లలో పవన్ కళ్యాణ్కు ఉన్న ఇమేజ్, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ కారణంగా ఓట్లను చీలకుండా బీజేపీ పవన్ కల్యాణ్ను రంగంలోకి దింపాలని భావించింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు హైదరాబాద్లో పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్ను కోరారు. దీంతో పవన్ కల్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు అంగీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: