📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Telugu weddings: మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

Author Icon By Rajitha
Updated: January 21, 2026 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మళ్లీ ప్రారంభమైంది. శుక్ర మౌఢ్యమి కారణంగా నవంబర్ నుంచి నిలిచిపోయిన శుభకార్యాలకు ఫిబ్రవరి 17తో ముగింపు పలికింది. దీంతో పెళ్లి (Marriage) తేదీల కోసం ఎదురు చూస్తున్న వధూవరుల కుటుంబాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు మళ్లీ సందడితో నిండనున్నాయి.

Read also: CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు

Wedding festivities return to the Telugu states

ఫిబ్రవరి 19 నుంచి బలమైన వివాహ ముహూర్తాలు

పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 21న అత్యధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నట్లు సమాచారం. ఇదే కాకుండా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై నెలల్లో కూడా మంచి శుభ ఘడియలు ఉండటంతో పురోహితులు, వెడ్డింగ్ ప్లానర్లు, క్యాటరింగ్ సర్వీసుల బుకింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.

పెళ్లి ఏర్పాట్లపై పెరిగిన డిమాండ్

పెళ్లిళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, డెకరేషన్, పురోహితుల సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతంలో రూ.25,000 నుంచి రూ.60,000 మధ్య ఉండే పురోహితుల సంభావన ఇప్పుడు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు పెరిగిందని కుటుంబాలు చెబుతున్నాయి. అలాగే రూ.10 లక్షల అద్దె ఉండే కొన్ని ఫంక్షన్ హాళ్లు ఇప్పుడు రూ.13 లక్షల వరకు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

పెరిగిన ఖర్చులతో ఆందోళనలో కుటుంబాలు

ఇప్పటికే పెళ్లి ఖర్చులు భారంగా మారిన పరిస్థితుల్లో, బంగారం ధరలు పెరగడం వధూవరుల కుటుంబాలపై మరింత భారం మోపుతోంది. శుభ ముహూర్తాలు వచ్చిన ఆనందం ఒకవైపు ఉంటే, మరోవైపు పెరిగిన ఖర్చులు కుటుంబాలను సతమతమయ్యేలా చేస్తున్నాయి. అయినా సంప్రదాయం, ఆచారం, ఆనందాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కుటుంబాలు ముందుకు సాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news marriage muhurtham Telugu News Telugu weddings wedding expenses

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.