Telugu News: Vishakapatnam-HPCL ట్యాంక్‌పై పిడుగు – భారీ అగ్నిప్రమాదం

Read Time:  1 min
Telugu News: Vishakapatnam-HPCL ట్యాంక్‌పై పిడుగు – భారీ అగ్నిప్రమాదం
FONT SIZE
GET APP

Vishakapatnam-విశాఖపట్నంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పరిధిలోని EIPL ఎనర్జీ కంపెనీ పెట్రోలియం ట్యాంక్‌పై పిడుగు(Lightning) పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిన అగ్నిజ్వాలలు ఫ్యాక్టరీ ప్రాంగణానికి వ్యాపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Vishakapatnam

అప్రమత్తమైన అధికారులు, ఫైర్ సిబ్బంది చర్యలు

అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైరింజన్లు(Fire Engines) మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెట్రోలియం నిల్వ ప్రాంతంలో ప్రమాదం సంభవించడం వల్ల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనపై HPCL, EIPL అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరైనా గాయపడితే వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. ఇప్పటివరకు ప్రాణనష్టం జరగకపోవడం స్థానికులకు ఊరటనిచ్చింది.

విశాఖపట్నంలో అగ్నిప్రమాదం ఎలా జరిగింది?
HPCL పరిధిలోని EIPL ఎనర్జీ కంపెనీ పెట్రోలియం ట్యాంక్‌పై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి.

ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా?
ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, జాగ్రత్త చర్యల కోసం అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-nicolas-maduro-tensions-in-the-caribbean/international/542891/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.