Free: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అర్హులైన ప్రజలందరికీ రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కొత్త ఆరోగ్య విధానం “ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-ఎన్టీఆర్ వైద్య సేవ” పథకం (Medical Service Scheme)కింద రూపొందించబడుతుంది. రాష్ట్ర మంత్రి మండలి ఈ మేరకు బీమా కంపెనీల నుండి టెండర్లను ఆహ్వానించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ నూతన విధానం ద్వారా దాదాపు 5 కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి రూ.2.50 లక్షల వరకు నేరుగా బీమా సేవలు అందిస్తారు. ఆ తర్వాత, ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ ద్వారా అదనంగా రూ.2.50 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వైద్య సేవలు లభిస్తాయి. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారికి (వర్కింగ్ జర్నలిస్టులతో సహా) రూ.2.5 లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది. వారికి మిగిలిన బీమా మొత్తాన్ని బీమా కంపెనీలు చెల్లిస్తాయి, ఆ తర్వాత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేస్తుంది.
ఈ నూతన విధానంలో 3257 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. మొత్తం 324 ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ పథకం కింద గుర్తింపు ఇవ్వనున్నారు. రోగికి అనారోగ్యం వచ్చిన ఆరు గంటలలోపు ఉచిత చికిత్సను ప్రారంభించాలి, మరియు 15 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు. ఈ ప్రక్రియలో అవినీతిని నివారించడానికి, ప్రతి రోగికి ఒక క్యూఆర్ కోడ్(QR code) కేటాయించి పర్యవేక్షిస్తారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ ద్వారా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ కొత్త పథకం కింద ఎంత వరకు ఉచిత వైద్య సేవలు లభిస్తాయి?
ఈ పథకం కింద అర్హులైన వారికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు లభిస్తాయి.
దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందా?
అవును, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారికి (ఉద్యోగులు మినహా) రూ.2.5 లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది. ఇందులో వర్కింగ్ జర్నలిస్టులకు కూడా అవకాశం కల్పించారు.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: