Telugu News: Abdul Nazir-వైద్యరంగంలో విశిష్ట ఆవిష్కరణ దిశలో ప్రభుత్వం

Read Time:  1 min
Telugu News: Abdul Nazir-వైద్యరంగంలో విశిష్ట ఆవిష్కరణ దిశలో ప్రభుత్వం
FONT SIZE
GET APP

Abdul Nazir- వైద్య రంగంలో విశిష్ట ఆవిష్కరణ దిశలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నశీర్ అన్నారు. ఆరోగ్య విద్యలో అనేక సంస్కరణలు, నూతన వైద్యకళావాలల ఏర్పాటు దిశలో విజయవంతంగా ముందుకు అడుగులు వేస్తోందని తెలిపారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్యగారి(Tummalapalli Kshetraiah) కళాక్షేత్రంలో మంగళవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 27, 28వ స్నాతకోత్సవాల్లో గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నశీర్ వర్శిటీ కులపతి హోదాలో కీలక ఉపన్యాసం చేసారు.

Abdul Nazir

క్యాన్సర్ రహిత సమాజం – ఆధునిక పరిశోధనలు

క్యాన్సర్ రహిత సమాజం కోసం తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని మెడికల్ కాలేజీల బోధనాస్పత్రుల్లో నిరంతరం పరిశోధనలు సాగుతున్నాయన్నారు. ఎటువంటి సంక్లిష్ట శస్త్రచికిత్సనైనా(Surgery) అందించే దిశలో కార్యచరణ చేపట్టామన్నారు. తరుణ వ్యాధుల నియంత్రణ, క్షేత్రస్థాయి నుంచి ఆస్పత్రుల ఆధునీకరణ ఇతరంశాల్లో స్థాయిలో విలేజీ క్లినిక్ల ఏర్పాటు విస్తృతంగా సాగుతుందన్నారు. ఇక వైద్య విద్యలో తమ ప్రభుత్వం ఒక స్థిర చిత్తంతో ఉందన్నారు.

గ్రామీణ ఆరోగ్య విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తుందని తెలిపారు. ప్రతి వైద్యకళాశాల బోధనాస్పత్రిలో ఆధునీక వైద్యచికిత్స విధానాల్లో శిక్షణ, అత్యాధునీక వైద్యపరికరాలు వినియోగం జరుగుతుందన్నారు. ఎటువంటి సంక్లిష్ట రోగ స్థితులకైన చికిత్స అందుతుందన్నారు. హృద్రోగం, కిడ్ని, ఆర్థోపెడిక్, పిడియాక్ట్రిక్స్ సేవలు లభిస్తాయన్నారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న వైద్యులు, బోధకులు, శస్త్రచికిత్స నిపుణులు అందుబాటులో ఉన్నారన్నారు.

సన్మానాలు మరియు బహుమతులు

ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన కార్డియో దోరాసిక్ సర్జన్ డాక్టర్ ఒపి యాదవకు డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డుతో సత్కరించారు. 27వ స్నాతకోత్సవానికి సంబందించి 53 మందికి, 28వ స్నాతకోత్సవానికి సంబంధించి 67 మంది వైద్యవిద్యార్ధులకు పతకాలు, నగదు బహుమతులు అందజేసారు. కొందరు ఈ కార్యక్రమంలో గవర్నర్ నుంచి నాలుగు నుంచి ఆరు పతకాలు అందుకున్నారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏ అంశంపై ప్రసంగించారు?
వైద్యరంగంలో విశిష్ట ఆవిష్కరణలు, ఆరోగ్య విద్య సంస్కరణలు, గ్రామీణ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రమాణాలపై ప్రసంగించారు.

క్యాన్సర్ రహిత సమాజం కోసం ఏం చేస్తున్నారు?

మెడికల్ కాలేజీల బోధనాస్పత్రుల్లో నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-urea-permanent-measures-to-reduce-urea-usage/telangana/544324/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.