📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Telugu language: మన సంస్కృతిని పరిరక్షించేది మాతృభాషే..

Author Icon By Rajitha
Updated: October 6, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘సదాస్మరామి’ పుస్తకావిష్కరణ సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ విజయవాడ : మన సంస్కృతిని కాపాడేది మన మాతృభాష మాత్రమే, అమ్మ భాషను గౌరవించేవారే నిజమైన సాహితీ మిత్రులు అని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ అన్నారు. గుంటూరులోని భారతీయ విద్యాభవన్ బొమ్మిడాల కృష్ణమూర్తి ఆడిటోరియంలో జరిగిన ‘సదాస్మరామి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పుస్తకాన్ని ఆవిష్క రించిన అనంతరం మాట్లాడుతూ సదాస్మరామి పుస్తకంలో రచయిత మండలి బుద్దప్రసాద్ 39 మంది సాహితీ ఉద్దండుల వివరాలను ప్రస్తావించారన్నారు. అడవి బాపిరాజు నుంచి సుసర్ల దక్షిణామూర్తి వరకు, రాపాక ఏకాంబరాచార్యుల వైశిష్ట్యం నుంచి యద్దనపూడి సులోచనారాణి నవలా ప్రస్థానం వరకు సవివరంగా తెలిపారన్నారు.

Pawan Kalyan: కురుపాం గురుకుల విద్యార్థినుల మృతిపై పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

Telugu language

‘తెలుగు భాష చాలా గొప్పది. మనం తెలుగువారిలా పుట్టినందుకు గర్వించాలి. అలాంటి భాష నశిస్తే జాతి నశిస్తుందని గుర్తెరగాలన్నారు. కులమతాలు, ప్రాంతీయ విభేదాలు, పక్కన పెట్టి జాతి వైభవానికి కృషి చేయాలని పుస్తక రచయిత, అవనిగడ్డ శాసనస భ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మద్రాసులో ఏ ఉద్యమం జరిగినా తెలుగు నాయకుల పాత్ర స్పష్టంగా ఉందని, వారి గురించి జాతీయ స్థాయిలో చెప్పుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిల్చిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ బొమ్మి డాల శ్రీకృష్ణమూర్తి, వీవీఐటీ విశ్వవిద్యాలయం పబ్లికేషన్ డివిజన్ సమన్వయకర్త మోదుగుల రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మన సంస్కృతిని కాపాడేది ఏమిటని జస్టిస్ బి. కృష్ణమోహన్ అన్నారు?
మన సంస్కృతిని కాపాడేది మన మాతృభాష మాత్రమేనని ఆయన అన్నారు.

‘సదాస్మరామి’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
మండలి బుద్ధప్రసాద్ ‘సదాస్మరామి’ పుస్తకాన్ని రచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News culture preservation Justice B Krishna Mohan latest news Sadhasmarami book launch telugu language Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.