తెలంగాణ (Telangana) గడ్డపై జనసేన పార్టీ తొలి విజయానికి సంబంధించిన ఫలితాలపై పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ ఆవిర్భవించిన తెలంగాణ నేలపై తొలి అడుగు పడిందని అన్నారు..న ల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14 వార్డులో ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్లో అగ్గు సాగర్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ ఫలితాలపై స్పందించారు. ప్రారంభంలో పార్టీ ఏ విధంగా ఉందో ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ తొలినాళ్లను గుర్తు చేసుకుంటే దారంతా గతుకులు, భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఉండేదని అన్నారు.
Read Also: Mancherial: వేలాల గుట్టపై మహాశివరాత్రి జాతర సందడి
ప్రస్థానానికి బలమైన స్ఫూర్తి
చిన్నపాటి ఆసరా కూడా లేదని, అయినప్పటికీ ఏదో కొద్దిగా ఆశ ఉండేదని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన వీరమహిళలు ఝాన్సీలక్ష్మీబాయి స్ఫూర్తిని నింపుకుని ఉద్యమ స్ఫూర్తితో జనసైనికులు ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునేందుకు సన్నద్ధమయ్యారని అన్నారు. తెలంగాణలో 332 చోట్ల పోటీ చేశామని, ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ స్థానం తమకు దక్కాయని అన్నారు.
మహా వృక్షమైనా చిన్న విత్తు నుంచే నేల పొరను చీల్చుకుంటూ మొలక వేస్తుందని అన్నారు. విశ్వవిజేత కూడా తల్లి కడుపులో అణువంతే ఉంటాడని అన్నారు. కోటి రతనాల తెలంగాణ (Telangana) లో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైందని, ఇప్పుడు తాము సాధించిన విజయాలు భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: