Telangana: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క(Bhattivikram Marka), తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహానికి రావాల్సిందిగా స్పీకర్కు భట్టి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల నేతలు కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. అంతకుముందు, భట్టి విక్రమార్క ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా కలిసి పెళ్లి పత్రికను అందజేశారు.
Read Also: Telangana: తెలంగాణలో ఎంసెట్ రద్దు చేయాలి: విద్యా కమిషన్
బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం
అంతకుముందు రోజు ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు భట్టికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: