News Telugu: Telangana Employees: ఏపీ నుండి సొంత రాష్ట్రానికి 58 మంది తెలంగాణ ఉద్యోగులు

Read Time:  1 min
Telangana Employees
Telangana Employees
FONT SIZE
GET APP

Telangana Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల బదిలీ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ (Telangana) ప్రాంతానికి చెందిన ఉద్యోగుల్లో 58 మందిని వారి స్వరాష్ట్రానికి పంపుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ప్రధానంగా క్లాస్-3, క్లాస్-4 స్థాయి ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన షరతులకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపి, ఈ బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read also: AP Crime: మైనర్ బాలికపై లైంగిక దాడి – టీచర్ అరెస్టు

Telangana Employees

Telangana Employees

Telangana Employees: రాష్ట్ర విభజన సమయంలో కేటాయింపు ప్రక్రియలో కొంతమంది తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వంలో కొనసాగారు. అయితే, వారిలో చాలామంది తమ స్వరాష్ట్రం తెలంగాణలోనే సేవలు కొనసాగించాలని కోరుతూ పలు మార్లు విజ్ఞప్తులు చేశారు. ప్రభుత్వం వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని, తెలంగాణ సర్కార్‌తో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 58 మందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు 698 మంది తెలంగాణ ఉద్యోగులను కూడా ఏపీ ప్రభుత్వం తిరిగి పంపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో మిగిలిన ఉద్యోగులు కూడా త్వరలోనే తెలంగాణ సర్వీసులో చేరనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.