📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

నారాలోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లపై టీడీపీ ఎమ్మెల్యే ఆసక్తిక వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: January 20, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చలికాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడికి పుట్టిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో రాజకీయం వేడెక్కింది. అయితే రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాదు ముఖ్యమంత్రి కూడా కావాలి అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కూటమిలో పెద్దలు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయిస్తారన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. పార్టీ నేతలు ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనని.. అలాగే లోకేష్‌ డిప్యూటీ సీఎం కావాలని.. సీఎం చంద్రబాబు చెబితేనే ప్రాధాన్యం ఉంటుందన్నారు.

అయితే డిప్యూటీ సీఎం, సీఎం పదవులు అంటూ టార్గెట్‌గా చేసుకుని వైఎస్సార్‌సీపీ సైకోలు కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదిరెడ్డి శ్రీనివాస్.
మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆసక్తికరంగా స్పందించారు. జనసేన పార్టీ నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని.. సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకోవడంలో తప్పు లేదని.. తాము కూడా పవన్ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Andhra Pradesh dcm pavan kalyan Nara Lokesh tdp mla

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.