📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు

Author Icon By Pooja
Updated: January 5, 2026 • 2:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి చెందిన మైనార్టీ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో(TDP Joining) చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వేలాది మంది ముస్లిం మైనార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును బహిరంగంగా ప్రకటించారు.

Read Also: AP Electricity: కరెంటు చార్జీలు తగ్గించేందుకు సర్కార్ కసరత్తు: మంత్రి పార్థసారథి

వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నరసింహులు టీడీపీలో చేరడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఈ చేరికలను టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు స్వాగతించారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ రాజకీయ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాంనగర్ క్యాన్ పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమైన భారీ బైక్(TDP Joining) ర్యాలీ సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కోర్ట్ రోడ్ మీదుగా సాగుతూ రాంనగర్ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ర్యాలీ సందర్భంగా పార్టీ నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. ఈ భారీ చేరికలు అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయనున్నాయని, ముఖ్యంగా వైసీపీకి ఇది పెద్ద దెబ్బగా మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu MinorityLeaders YSRCPShock

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.