T20 World Cup: భారత్ అంధ మహిళా క్రికెట్ జట్టు విజయం గర్వకారణం

Read Time:  1 min
T20 World Cup
T20 World Cup
FONT SIZE
GET APP

భారత అంధ మహిళల క్రికెట్ జట్టు… తొలి టి20 వరల్డ్ కప్(T20 World Cup) విడతగా నిలవడం దేశానికి గర్వకారణమని సిఎం చంద్రబాబు కొనియాడారు. వారి అంకిత భావం సూర్తిదాయకమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. క్రికెట్(Cricket) బృందానికి అభినందనలు తెలిపారు. భారత జట్టు గెలుపుపై క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, శాప్ చైర్మన్ రవినాయుడు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన తెలుగు తేజం పి.కరుణకుమారిని ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

గెలుపు చారిత్రాత్మకం : నారా లోకేష్

భారత అంధ మహిళల క్రికెట్ జట్టు టి20 వరల్కప్(T20 World Cup) గెలవడం చారిత్రాత్మకమని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. జట్టు సభ్యులకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది దేశానికి అత్యున్నత గౌరవాన్ని తెచ్చిన సందర్భం. అంతర్జాతీయ వేదికపై వారు చూపిన ధైర్యం, ధృఢ సంకల్పం ఆనందదాయకం’ అని పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.