📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Good News : ఏపీ వాసులకు తీపికబురు

Author Icon By Sudheer
Updated: April 5, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్‌ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్‌ (నాలా) చట్టాన్ని రద్దు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. 2006 నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలను అప్పటి రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం చెల్లించే అవకాశం కల్పించనుంది. ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. అపరాధ రుసుములు లేకుండా, వన్ టైమ్ ఆప్షన్ కింద ఈ బకాయిలను చెల్లించేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు.

స్లాట్ బుకింగ్ ద్వారా సులభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ

రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించారు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రజలు తమ రిజిస్ట్రేషన్ పనులను త్వరగా పూర్తిచేసుకునే అవకాశం పొందనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

భూ వినియోగ మార్పులకు సులువు, భూ వివాదాలకు పరిష్కారం

నాలా చట్టం రద్దుతో భూముల వినియోగ మార్పులు సులభతరం కానున్నాయి. భూ వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై చర్చించనుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ఆటో మ్యుటేషన్లను సులభతరం చేయడానికి రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను రెవెన్యూ డేటాతో లింక్ చేసినట్లు మంత్రి తెలిపారు. మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్, డీటీసీపీతో అనుసంధాన ప్రక్రియను ఏప్రిల్ 15 నాటికి పూర్తిచేస్తామని చెప్పారు.

సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ అవకాశం, ఆదాయవృద్ధి

రెవెన్యూశాఖ రూ.5 వేలు చెల్లించిన వారికి సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించింది. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో సెలవు రోజుల్లోనూ స్టాంప్ డ్యూటీ ఆదాయం వస్తుందని భావించిన ప్రభుత్వం, మార్చి చివరిలో మూడు రోజులకే రూ.72 కోట్ల ఆదాయం సంపాదించిందని మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల రూపురేఖలను ఆధునీకరించేందుకు అవసరమైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులను వినియోగించనున్నట్లు చెప్పారు.

Ap ap sub registrar office Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.