📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: Supreme court: పల్నాడు జంట హత్యల కేసు ..సోదరులకు ఎదురుదెబ్బ

Author Icon By Pooja
Updated: November 28, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి(Pinnelli Venkataramireddy) సుప్రీంకోర్టులో(Supreme court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తమ అరెస్ట్‌ను నిలుపుదల చేయాలని కోరుతూ వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నాడు కొట్టివేసింది.

Read Also: Kerala: కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

ముందస్తు బెయిల్‌కు అనర్హులుగా నిర్ధారణ

జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్‌కు అర్హులు కారని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక, గతంలో వారి అరెస్ట్‌పై తాము విధించిన మధ్యంతర(Supreme court) ఉత్తర్వులను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో, పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాది తమ క్లయింట్లు లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

హత్యకేసు వివరాలు, దర్యాప్తు

ఈ దారుణ ఘటన ఈ ఏడాది మే 24న జరిగింది. గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై బైక్‌పై తిరిగి వస్తుండగా, వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్ద స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును రాయితో కొట్టి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్యేనని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, మృతుల బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ-6గా, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఏ-7గా ఉన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.