Sunil Nayak Arrest Warrant: ఆంధ్రప్రదేశ్ (AP) డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో, అతడిని అరెస్టు చేయడానికి గుంటూరు ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని బృందం పట్నా వెళ్లింది. అయితే, ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయడానికి పట్నా హైకోర్టు నిరాకరించడంతో, గుంటూరు మొబైల్ కోర్టులో పోలీసులు అరెస్ట్ వారెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Hyatt Regency: నారా లోకేష్ ముంబై పర్యటన ఖరారు

కస్టోడియల్ టార్చర్ కేసు ఏంటి?
గత ప్రభుత్వ హయాంలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజుపై రాజద్రోహం కేసు నమోదైంది. ఆయన ను హైదరాబాద్లో అరెకస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరు తీసుకొచ్చారు. ఆయన ను కస్టడీలోకి తీసుకోగా.. ఆ సమయంలో తనను చిత్రహింసలకు గురిచేశారని రఘురామ ఆరోపించారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. కాళ్లపై దారుణంగా కొట్టారన్నారు. ఈ కస్టోడియల్ టార్చర్ అంశంపై గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామ మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో సునీల్ నాయక్ పాత్ర కూడా ఉందని ఫిర్యాదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: