Latest news: Subba Reddy: సిట్’వద్దకు రాలేను, విచారణకు హైదరాబాద్ కు రండి

Read Time:  1 min
Subba Reddy
Subba Reddy
FONT SIZE
GET APP

మాజీ టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి

తిరుమల : దేవుని చెంత సేవకుడిగా సేవలందించిన (Subba Reddy) టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కల్తీనెయ్యి కేసులో విచారణ చేయడానికి సిబిఐ సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే ఆయనకు సిట్ అధికారులు గత వారమే నోటీసులు జారీచేశారు. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల 13వతేదీ 16వతేదీ విచారణకు రాలేనని 17వతేదీ తరువాత వస్తానని సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏకంగా శనివారం సిట్ అధికారులకు తనదైన శైలిలో సమాచారం ఇవ్వడం, తనకు ఆరోగ్యం సరిగా లేనందున తిరుపతిలోని సిట్ తాత్కాలిక కార్యాలయానికి రాలేనని, వీలైతే 20వతేదీ హైదరాబాద్(Hyderabad) లోని తన ఇంటికి వచ్చి విచారణ చేయవచ్చని తెలిపారు.

Read also: రాజ్‌భవన్‌లో గవర్నర్, సీఎం–ఉపరాష్ట్రపతి భేటీ

Subba Reddy
Subba Reddy

మాజీ పిఎ చిన్నఅప్పన్న కస్టడీపై ఏసిబి కోర్టు తీర్పు కీలకం

దీంతో సిట్ అధికారులు ఇప్పుడు అనుసరించే వ్యూహం ఏంటనేది కల్తీనెయ్యి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న, రిమాండ్లో ఉన్న నిందితుల్లో మరింత ఆందోళన నెలకొందని తెలుస్తోంది. ఇదేసమయంలో వైవి మాజీ పిఎ చిన్నఅప్పన్నను కస్టడీకి తీసుకునే అంశంపై నేడు నెల్లూరు ఏసిబి కోర్టు తీర్పువెలువరించనుంది. ఒకవేళ కోర్టు కస్టడీకి ఇస్తే అప్పన్నను కూడా హైదరాబాద్కు తీసుకెళ్ళి సుబ్బారెడ్డితో బాటు కలిపి విచారణ చేస్తారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 20వతేదీ విచారణకు వస్తున్నామని సిట్ కూడా ఆయనకు సమాచారం అందించడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.