हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద

Sharanya
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) నిండుతుందని అధికారవ ర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల, సుంకేశుల బ్యారేజ్ల (Jurala and Sunkeshula barrages) నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,38,841 క్యూసెక్కులు చేరుతుండగా విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 67,488 క్యూసెక్కులను దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20వేల క్యూసెక్కులు, హంద్రీ నీవా కోసం 1,013 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటుండగా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా1,600 క్యూసెక్కులను తెలంగాణ తీసుకుంటోంది.

ఆల్మట్టి డ్యామ్లోకి 94వేల క్యూసెక్కులు

మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతో పాటు మలప్రభ, ఘటప్రభలు వరద పోటుత్తుతున్నాయి. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్లో (Almaty Dam)కి 94వేల క్యూసెక్కులు చేరుతుండగా 90వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్లోకి 1.15 లక్షల క్యూ సెక్కులు చేరుతుండగా1.01 లక్షల క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 1.22 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్కు వస్తున్న 39,339 క్యూసెక్కుల వరదను వచ్చిందొచ్చినట్టుగా దిగువన శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. శ్రీశైల జలాశయం (Srisailam Reservoir) ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు అధికారులు తెలిపిన లెక్కల వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 882.70 అడుగులు – ఉన్నాయి. జలాశయంలో నీటి సామర్థం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి సామర్థం 202.9673 టీఎంసీలుగా నమోదయి ఉంది. విద్యుత్ ఉత్పత్తికి కుడి ఎడమల నుంచి 67,488 క్యూసెక్కుల నీటిని సాగరకు విడుదల చేస్తున్నారు. ఏపీ జల విద్యుత్ కోసం32,173 క్యూసెక్కుల నీటిని వాడుతుండగా, తెలంగాణ ప్రాంతం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని జల విద్యుత్ కోసం వినియోగిస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి కృష్ణానది వరద ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ఎస్పి అధికారులు ఆదివారం ఉదయం ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.

ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 565 అడుగులకు – చేరుకోవడంతో అధికారులు తాగు నీటి అవసరాల కోసం 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా 2 వేల క్యూసెక్కులకు పెంచుతూ నీటి విడుదల కొనసాగించనున్నారు. ఎడమ కాలువ కింద ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. తాగునీటి కోసమే కాకుండా పంటలకు సాగు నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.07 లక్షల – క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తంది. అందులో స్పిల్ వే ద్వారా 74,081 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,464 క్యూసెక్కులు వరద నీటిని వినియోగిస్తున్నారు. దీంతో పాటు ఆయకట్టుపై ఆధారపడిన నెట్టెంపాడు లిప్ట్కు 750 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు భీమా లిప్ట్కు 750 క్యూసెక్కులు, కోయిల్సాగర్ – ఎత్తిపోతలకు 315 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు .

Read hindi news: hindi.vaartha.com

read also: Tirumala: మొదటిఘాట్లో ఎలుగుబంటి హల్చల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870