📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం వద్ద పోటెత్తిన వరద ప్రవాహం

Author Icon By Sharanya
Updated: July 28, 2025 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక, మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది (Krishna River) లో భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయాని (Srisailam Reservoir) కి భారీగా వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 1,27,392 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కు‌లుగా నమోదైంది.

53,764 క్యూసెక్కుల నీరు

రెండు స్పిల్ వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు (Pothireddypadu) హెడ్ రెగ్యులేటరీ నుంచి 20వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.

శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 882.40 అడుగుల నీటి మట్టం ఉంది. శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా నమోదైంది.

శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం ఎందుకు పెరిగింది?

కృష్ణా నదికి ఎగువన ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో భారీ వర్షాలు పడటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఈ కారణంగా వరద ప్రవాహం పెరిగింది.

వరద వల్ల ఎలాంటి ప్రాంతాలకు ప్రభావం పడే అవకాశముంది?

శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం జిల్లాల నదీతీర ప్రాంతాలకు వరద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Read hindi news: hindi.vaartha.com

Read also: CM Chandrababu Naidu Singapore Visit: ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ

AP Telangana Dam Updates Breaking News Floods in Srisailam Krishna River Flood Alert latest news Srisailam Dam Gates Opened Srisailam Reservoir Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.