📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Today News : SriSailam – గణపయ్యకు శ్రీశైలం మల్లన్న పట్టువస్త్రాల సమర్పణ

Author Icon By Shravan
Updated: September 3, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

SriSailam : కాణిపాకం దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సిద్ధి, బుద్ధి సమేత స్వామి, అమ్మవార్లకు శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం తరపున నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీశైలం దేవస్థానం తరపున ఆలయ ఈఓ ఎం. శ్రీనివాసరావు, (EO M. Srinivasa Rao) ఆలయ అధికారులు, అర్చకులు కాణిపాకం ఆలయానికి చేరుకుని అతిథిగృహం నుండి పట్టువస్త్రాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.

ఘన స్వాగతం మరియు ప్రత్యేక పూజలు

పట్టువస్త్రాలను స్వామివారి ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాణిపాకం ఆలయ ఈఓ కె. పెంచల కిషోర్, అర్చకులు రాజగోపురం వద్ద శ్రీశైలం ఆలయ ఈఓ, అధికారులను ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి శేషవస్త్రాలు, చిత్రపటాలు, ప్రసాదాలను వారికి అందజేశారు.

పరస్పర సత్కారాలు మరియు కార్యక్రమంలో పాల్గొన్నవారు

కాణిపాకం ఆలయానికి పట్టువస్త్రాలను తీసుకువచ్చిన శ్రీశైలం ఆలయ ఈఓ, అధికారులు, సిబ్బందిని కాణిపాకం దేవస్థానం తరపున సత్కరించగా, శ్రీశైలం దేవస్థానం తరపున కాణిపాకం ఆలయ ఈఓ, అధికారులు, సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం, శ్రీశైలం దేవస్థానం (Temple) ఏఈఓలు హరిదాసు, కాణిపాకం ఆలయ ఏఈఓలు రవీంద్రబాబు, ధనుంజయ, ధనపాల్, సూపరెండెంట్లు కోదండపాణి, శ్రీధర్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజినాయుడు, చిట్టిబాబు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.

కాణిపాకం ఆలయంలో పట్టువస్త్రాలను ఎవరు సమర్పించారు?
శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం తరపున ఆలయ ఈఓ శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏ ఆలయాల అధికారులు పాల్గొన్నారు?
కాణిపాకం మరియు శ్రీశైలం ఆలయాల ఈఓలు, ఏఈఓలు, సూపరెండెంట్లు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/religious-celebrations-shivaputra-riding-on-gajavahana/andhra-pradesh/540673/

Breaking News in Telugu Devotional News Ganapayya Hindu Traditions Indian Culture Latest News in Telugu Mallanna Religious Ceremony Spiritual events Srisailam Telugu News Today Temple rituals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.