Srinivasa Rao: విద్యుత్తు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావు (Srinivasa Rao) డిమాండ్ చేసారు. ఇళ్లకు బిగిస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు వల్ల వినియోగదారులకు, ప్రజలకు కలిగే లాభం ఏమిటని నిలదీశారు. వినియోగదారుల గొంతు కోయడానికి, అదానీ, షిర్డీసాయి కంపెనీలను ఉద్దరించడానికే వీటిని అమరుస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, బిగించిన వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక్కో స్మార్ట్ మీటర్ రూ.12వేల నుంచి రూ.18 వేల వరకు ఖర్చవు తుందని, ప్రతినెలా ఇచ్చే విద్యుత్ బిల్లులో దీనిని కలుపుతారని చెప్పారు. రాష్ట్రంలోని వినియోగ దారులపై ఏడాదికి భారం రూ.50వేల కోట్లు ఉంటుం దన్నారు. ఈ అంశంపై కరపత్రాలు ద్వారా తాము ప్రజలకు వివరిస్తున్నామని, ప్రజలు అంగీకరించి వీటికి వ్యతిరేకంగా దరఖా స్తులపై సంతకాలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రం ఆదేశాలకు లొంగకుండా ప్రజల క్షేమం కోరుకుంటే వెంటనే స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసేందుకు వామపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలతో భవిష్యత్ కార్యక్రమంపై చర్చిస్తామన్నారు.
Srinivasa Rao: స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలి: సిపిఎం శ్రీనివాసరావు
By
Ramya
Updated: July 1, 2025 • 10:49 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.